రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు, మిల్లర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించినప్పటి నుంచి రైతు ఖాతాలో డబ్బు జమయ్యే వరకు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ హరీశ్ టెలికాన్ఫరెన్స్ - paddy purchase in telangana
మిల్లులకు వచ్చే ధాన్యాన్ని వెంటనే ఖాళీ చేసి, లారీ ఏ కేంద్రం నుంచి వచ్చిందో అక్కడికే పంపాలని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. రైతులు ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తీసుకువస్తే హమాలీల ఛార్జీలు చెల్లించాలని చెప్పారు.
![ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ హరీశ్ టెలికాన్ఫరెన్స్ medak district collector, medak district collector harish](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:36:16:1620648376-tg-srd-41-10-medak-colle-telcon-img-ts10115-10052021172042-1005f-1620647442-557.jpg)
మెదక్ జిల్లా కలెక్టర్, మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిన్న చిన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో.. ధాన్యాన్ని మూడు, నాలుగు రోజుల్లోగా మిల్లులకు తరలించాలని కలెక్టర్ చెప్పారు. రైస్ మిల్లుల యజమానులు అధిక సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకుని లారీలు ఖాళీ చేసేలా చూడాలని సూచించారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా తహసీల్దార్లు మానిటరింగ్ చేయాలని, నేటి నుంచి ప్రతి రెండు గంటలకు ఒకసారి లారీల తాజా స్థితి వివరాలు తనకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు.