మెదక్లో కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటన
విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం - మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించారు. వీధుల్లో తిరుగుతూ పారిశుద్ధ్య పనులు పరిశీలించారు.
![విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4932087-349-4932087-1572615508546.jpg)
మెదక్లో కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటన
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్నగర్, కన్నారం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సరిగా లేవని కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 రోజుల ప్రణాళికలో పనులు సక్రమంగా చేయలేదని ప్రజాప్రతినిధులు, అధికారులపై మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారికి షోకాజ్ నోటీసులివ్వాలని డీపీవో హనోక్ను ఆదేశించారు.
- ఇదీ చూడండి : రోడ్డుపై గుంత ఉందా...? అయితే ఓ సెల్ఫీ కొట్టండి!