కొవిడ్ నిబంధనల మధ్య గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నామని మెదక్ అడిషనల్ కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఆర్డీఓ సాయిరామ్, డీఎస్పీ కృష్ణమూర్తి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రసంగం..
జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ఉదయం 8 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని చెప్పారు. కలెక్టరేట్లో తొమ్మిదింటికి జెండా ఆవిష్కరణ, పోలీసుల గౌరవ వందనం ఉంటుందని తెలిపారు. ప్రజలను ఉద్దేశించి పాలనాధికారి ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
కలెక్టరేట్కు వచ్చిపోయే దారులను చదును చేయాలని.. ఆర్అండ్బీ ఈఈకి సూచించారు. మైదానంలో దుమ్ము లేవకుండా నీళ్ళు చల్లడం, తాగునీరు సమకూర్చడం, మార్క్ ప్రకారం సున్నం వేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిని ఆదేశించారు.