తెలంగాణ

telangana

By

Published : Jul 25, 2020, 7:27 AM IST

ETV Bharat / state

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్​... యువకుడు మృతి

మెదక్​ జిల్లా రెడ్డిపల్లి వద్ద రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమ్ముడు మృతి చెందగా అన్నకు తీవ్రగాయాలయ్యాయి.

Lorry, Bike Road Accident at Reddypalli in Medak district
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్​... యువకుడు మృతి

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నిలిచి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రీధర్​ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... రవి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మృతి చెందడం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్​... యువకుడు మృతి

ఇవీ చూడండి:'మీ డబ్బు ఎవడికి కావాలి.... న్యాయం చేయండి చాలు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details