తెలంగాణ

telangana

ETV Bharat / state

మొదక్ జిల్లా నిజాంపేటలో జల శక్తి అభియాన్

భూగర్భ జలాలు తగ్గిపోతున్న పరిస్థితిని మార్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన జలశక్తి అభియాన్ గురించి ప్రభుత్వాధికారులు గ్రామాల్లో పర్యటించి పథకం గురించి వివరిస్తున్నారు. హరితహారం, ఇంకుడు గుంతలు వంటి కార్యక్రమాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.

By

Published : Jul 12, 2019, 8:08 PM IST

మొదక్ జిల్లా నిజాంపేటలో జల శక్తి అభియాన్

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా కేంద్రం ఎంపిక చేసిన మండలాల్లో మెదక్ జిల్లా నిజాంపేట్ ఉండటం ఆనందంగా ఉందని మండల వాసులు చెబుతున్నారు. అందులో భాగంగానే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి గాయత్రీ మిశ్రా.. వారి బృందంతో కలిసి గత మూడ్రోజులుగా మండలంలో పర్యటించారు. ఈ రోజు మెదక్ జిల్లా కలెక్టరేట్​లో అధికారులకు జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి వివరించారు. నిజాంపేటలో మొత్తం 14 గ్రామాలు, 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటినీ పర్యటించిన మిశ్రా బృందం... ప్రజలందరికీ ఈ కార్యక్రమం గురించి వివరించారు. హరితహారంలో భాగంగా 10 లక్షల మొక్కలు నాటపోతున్నామని తెలిపారు. అలాగే ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు చెప్పారు. జల శక్తి అభియాన్ ద్వారా మూడు నెలల్లో ఈ పథకాలను అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు.

మొదక్ జిల్లా నిజాంపేటలో జల శక్తి అభియాన్

For All Latest Updates

TAGGED:

COLLECTOR

ABOUT THE AUTHOR

...view details