తెలంగాణ

telangana

ETV Bharat / state

12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి: గోపాల్​ నాయక్​ - 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి: గోపాల్​ నాయక్​

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మెదక్​ పట్టణంలో లాంబాడి హక్కుల పోరాట సమితి ఆధర్యంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి: గోపాల్​ నాయక్​

By

Published : Aug 9, 2019, 6:23 PM IST

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రాందాస్​ కూడలిలో అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాత బస్టాండ్ నుంచి ఆర్ అండ్ బి అతిథి గృహం వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించినా.. నిధులు కేటాయించలేదన్నారు. 12 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు.

12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి: గోపాల్​ నాయక్​

ABOUT THE AUTHOR

...view details