తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సాపూర్​లో పలు కాలనీలు జలమయం.. - మెదక్​ జిల్లాలో వర్షాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో మెదక్​ జిల్లా నర్సాపూర్​ పట్టణంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. నర్సాపూర్​-హైదరాబాద్ రహదారి పక్కన కూలీలకు ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాలు నీట మునిగాయి.

heavy rain at narsapur in medak district
నర్సాపూర్​లో పొంగిపొర్లుతున్న రాయరావు చెరువు... ఇళ్లు జలమయం

By

Published : Oct 14, 2020, 1:25 PM IST

వాయుగుండం ప్రభావంతో మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో భారీ వర్షం కురిసింది.పట్టణంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళి యాదవ్‌, కమిషనర్ రమణమూర్తి కాలనీల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు.

జలమయం

జాతీయ రహదారి నిర్మాణంలో పనిచేసే కూలీలకు నర్సాపూర్‌-హైదరాబాద్‌ రహదారి పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోని సామాగ్రి అంతా నీటిపాలయ్యింది. స్థానికులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రహదారి నిర్మాణ గుత్తేదార్లు చెప్పారు.

ఇదీ చదవండి:లాలాపేటలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న నాలా

ABOUT THE AUTHOR

...view details