మహా శివరాత్రిని పురస్కరించుకుని ఏడుపాయలలో జరిగే జాతర కోసం నిధులు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.కోటి మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి తెలిపారు.
అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోతంశెట్టిపల్లి నుంచి ఏడుపాయల వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.31 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏడుపాయలలో ఔట్ పోస్టును ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వివరించారు.