తెలంగాణ

telangana

ETV Bharat / state

దాడికి నిరసనగా అటవీ శాఖ సిబ్బంది ర్యాలీ - దాడికి నిరసనగా అటవీ సిబ్బంది ర్యాలీ

సారసాల గ్రామంలో అటవీ అధికారులపై జరిగిన దాడికి రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్​ చేస్తూ... మెదక్​లో అటవీ శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు.

FOREST OFFICERS CONDUCTED RALLY AGAINST ATTACK

By

Published : Jul 1, 2019, 5:34 PM IST

సిర్పూర్ కాగజ్​నగర్​ సారసాలలో అటవీ అధికారులపై జరిగిన దాడికి నిరసనగా మెదక్​లో అటవీశాఖ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. డివిజన్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసిన అధికారులు... అనంతరం జాయింట్ కలెక్టర్ నగేష్​కు వినతి పత్రం అందజేశారు. విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారిణిపై నిర్దాక్షిణ్యంగా దాడికి దిగిన జడ్పీ వైస్ ఛైర్మన్, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్​ చేశారు. ఇటువంటి దౌర్జన్యపూరిత చర్యలతో అధికారుల మనోధైర్యం దెబ్బతిని విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అటవీ సిబ్బంది ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details