తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు'

స్థానిక సంస్థల ఓట్ల  లెక్కింపునకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను చురుగ్గా కొనసాగిస్తోంది. లెక్కింపు కేంద్రం వద్ద పోలీసులు మూడు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

By

Published : Jun 2, 2019, 11:08 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మండలాల్లో ఈనెల 4న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలను లెక్కించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు బందోబస్తును పటిష్ఠం చేయనున్నారు.
మూడు అంచెల భద్రతా వ్యవ్యస్థను ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఏజెంట్లు అనుమతి పత్రాలు తీసుకుని ముందుగానే రావాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు తీసుకురావద్దని స్పష్టం చేశారు.

ఈనెల 4న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల లెక్కింపు
ఇవీ చూడండి : అభివృద్ధి చేశాం.. ఇంకా చేసి చూపిస్తాం..

ABOUT THE AUTHOR

...view details