మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలిక ఎన్నకలకు తెరాస సన్నద్ధమవుతోంది. తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. నర్సాపూర్లో మున్సిపల్ అభ్యర్థి మురళియాదవ్కు మద్దతుగా బీబీపాటిల్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేశారన్నారు. కారు గుర్తుకు ఓటేసి తమను గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు ఎంపీ హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'