తెలంగాణ

telangana

By

Published : Dec 20, 2020, 4:01 PM IST

ETV Bharat / state

'అన్నదాతలు రోడ్డుపై ఉంటే.. పార్టీ బలోపేతానికిి చేరికలు'

అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు రోడ్డు మీద నిరసన కార్యక్రమాలు చేస్తుంటే.. పార్టీ పెంపునకు భాజపా ప్రయత్నాలు చేస్తోందని సీపీఎం మెదక్ కార్యదర్శి మల్లేశం ఆరోపించారు. దిల్లీ దీక్షలో అమరులైన రైతులకు మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తాలో నివాళులు అర్పించారు. దిల్లీలో రైతులు చేస్తోన్న పోరాటాన్నికేంద్రం వక్రీకరిస్తోందని విమర్శించారు.

cpm-tribute-to-farmer-martyrs-in-medak-district
'అన్నదాతలు రోడ్డుపై ఉంటే... పార్టీ పెంపునకు భాజపా ప్రయత్నాలు'

అంబానీ, అదానీ వంటి ధనవంతులకు కొమ్ము కాస్తూ.. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని సీపీఎం మెదక్ కార్యదర్శి మల్లేశం ఆరోపించారు. 3 సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తాలో డిసెంబర్ 20ని దేశవ్యాప్తంగా రైతు అమరవీరుల దినంగా ప్రకటిస్తూ.. అమరులైన అన్నదాతలకు పలు ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆయన నివాళులు అర్పించారు.

దిల్లీలో రైతులు చేస్తోన్న పోరాటాన్ని కేంద్రం వక్రీకరిస్తోందని విమర్శించారు. ఈ రైతు పోరాటంలో నవంబర్ 26 నుంచి నేటి వరకు 33 మంది రైతులు వీరమరణం పొందారని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు రోడ్డు మీద నిరసన కార్యక్రమాలు చేస్తుంటే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మతోన్మాద శక్తులు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది రెండు రాష్ట్రాల పోరాటమని ప్రభుత్వం చెప్తోందని.. త్వరలో అన్ని రాష్ట్రాల నుంచి రైతులు తరలొస్తారని ఆయన హెచ్చరించారు. వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రజాసంఘాల తరఫున డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:తెలుగు రాష్ట్రాలకు మరిన్ని రుణాలు- కేంద్రం ఓకే

ABOUT THE AUTHOR

...view details