రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలపరిధిలోని అవంచ, రెడ్డిపల్లి, ఇబ్రహీంబాద్ గ్రామాలతో పాటు కౌడిపల్లి మండలం పలు గ్రామాల్లో నిర్మాణాలు చేస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. నవంబర్ 15 లోపు మరిన్ని రైతు వేదికలను పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు - రైతు వేదికలను పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలపరిధిలోని నిర్మితమవుతున్న రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. నవంబర్ 15 లోపు మరిన్ని రైతు వేదికలను పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు
మండలంలో రైతు వేదిక పనులు ఏ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 320 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. రైతులు.. తేమ శాతం లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లాలని హనుమంతరావు అన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందున ఎల్లప్పుడూ టార్పాలిన్ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఇదీ చూడండి:ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి