ఆధునిక పద్ధతుల్లో సాగు రైతు అభివృద్ధికి దోహదంచేస్తుందని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాం నాయక్ అన్నారు. హవేలీ ఘనపూర్ మండలం కుచన్పల్లిలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి పొలంలో డ్రోన్తో పంటలకు మందుల పిచికారీపై అవగాహన కల్పించారు.
డ్రోన్ పరికారంతో కేవలం10 నిమిషాల్లో ఎకరాపొలానికి మందు పిచికారి చేయవచ్చన్నారు. ఇలా చేయడం వల్ల రైతు.. కూలీల, నీటి కొరత అధిగమించి సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చని సూచించారు. అన్నదాతలు అధునాతన పద్ధతులు అవలంభించి అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు.