ప్రభుత్వ సూచనలపై ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితరహిత కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లు జిల్లా అదనపు పాలనాధికారి నగేశ్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో ఈ ఆఫీస్ను ప్రారంభించారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లోను ఈ ఆఫీస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
కలెక్టరేట్లో ఈ–ఆఫీస్ను ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ నగేశ్ - తెలంగాణ తాజా వార్తలు
మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాయాలను కాగిత రహిత కార్యాలయాలుగా మార్చాలని జిల్లా అదనపు పాలనాధికారి నగేశ్ తెలిపారు. మెదక్ జిల్లాలో మొట్టమొదటిగా కలెక్టరేట్లో శనివారం ఈ–ఆఫీస్ను ప్రారంభించారు.
![కలెక్టరేట్లో ఈ–ఆఫీస్ను ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ నగేశ్ e office started in medak collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8434217-709-8434217-1597504208478.jpg)
కలెక్టరేట్లో ఈ–ఆఫీస్ను ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ నగేశ్
ఈ–సేవ, మీ–సేవ తరహాలో ఈ –ఆఫీస్లను ఎలాంటి కాగితాలు, పేపర్లు ఉపయోగించకుండా పనులు నిర్వర్తించాలన్నారు. అధికారుల సంతకాలను డిజిటల్ సిగ్నేచర్ కీ (డీఎస్కీ) తయారు చేయించాలని... ఏదైనా సంతకం ఉంటే ఆన్లైన్లోనే లాగిన్ చేసుకోవాల్సిందిగా వివరించారు. కార్యక్రమంలో ఎన్ఐసీ జిల్లా మేనేజర్ సందీప్, ఐటీఈ అండ్ సీ డిపార్టుమెంట్, ఎన్ఐసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:నిర్మల్ జిల్లాలో అంబరాన్నంటిన జెండా పండుగ సంబరాలు