తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటాఏస్​.. ఇద్దరు మృతి - latest news on accident at pedda chintha kunta two people died

అతి వేగంతో ఓ టాటాఏస్​ వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్​ జిల్లాలో చోటుచేసుకుంది.

accident at pedda chintha kunta two people died
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటాఏస్​.. ఇద్దరు మృతి

By

Published : Dec 27, 2019, 2:57 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్​ వైపు వెళ్తున్న ఓ టాటాఏస్​ వాహనం అతివేగంతో పెద్ద చింతకుంట వద్ద నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నర్సాపూర్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే మదన్​రెడ్డి తన వాహనం దిగి క్షతగాత్రుల వివరాలు తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటాఏస్​.. ఇద్దరు మృతి

ఇదీ చదవండి:నేడు మంత్రివర్గ సమావేశం... అసాధారణ భద్రతా ఏర్పాట్లు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details