తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏర్పాట్లపై ఆరా..!

శివరాత్రి ఉత్సవాలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాల వారిగా పాలనాధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

By

Published : Mar 1, 2019, 9:59 PM IST

మెదక్​ కలెక్టర్​

ఏడుపాయలలో 4నుంచి ఉత్సవాలు
మహా శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేవస్థానంలో జాతర పనులను జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి పరిశీలించారు. అలాగే మహబూబాబాద్​ జిల్లా కురవిలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని పాలనాధికారి శివలింగయ్య సందర్శించారు. ఎస్పీ కోటిరెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఏడుపాయలలో 4నుంచి ఉత్సవాలు:

మెదక్​ జిల్లాలోని ఏడు పాయల దేవస్థానంలో ఈ నెల 4 నుంచి మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ జాతరకు సంబంధించి.. పారిశుద్ధ్యం, మంచినీరు, స్నాన ఘట్టాలు, దారిపొడవునా విద్యుత్​ లైట్లు వంటి పనులు త్వరతగతిన పూర్తి చేయాలని కలెక్టర్​ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి:"అందమైన పార్కుగా మార్చండి"

శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా.. జాతర ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు.

ABOUT THE AUTHOR

...view details