మెదక్ జిల్లాలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడి ఓ మహిళ మృతి చెందింది. శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన మహిళ 3 రోజుల క్రితం అనారోగ్యంతో ఉస్మానియా అస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది.
దొంతిలో కరోనాతో మహిళ మృతి.. అధికారుల అప్రమత్తం - దొంతిలో కరోనాతో మృతి చెందిన మహిళ వార్తలు
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో ఓ మహిళ కరోనాతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న అధికారులు మహిళ కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్లో ఉంచారు. గ్రామంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

దొంతిలో కరోనాతో మహిళ మృతి.. అధికారుల అప్రమత్తం
విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి భవాని, తహసీల్దార్ భాను ప్రకాశ్లు గ్రామానికి వెళ్లి మహిళ వివరాలను సేకరించారు. వారి కుటుంబ సభ్యులు 19 మందిని గృహ నిర్బంధం చేశారు. అనంతరం గ్రామంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీచూడండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు