తెలంగాణ

telangana

By

Published : Jun 12, 2020, 10:04 PM IST

ETV Bharat / state

పెళ్లి వ్యాను బోల్తా... 15 మందికి తీవ్రగాయాలు

మెదక్​ జిల్లా నార్సింగి మండలం జప్తిశివనూర్​ వద్ద పెళ్లి విందుకు 30మందితో వెళ్తున్న వ్యాను బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

15-men-injured-in-marriage-van-turtle-in-medak-district
పెళ్లి వ్యాను బోల్తా... 15 మందికి తీవ్రగాయాలు

మెదక్‌ జిల్లా నార్సింగి మండలం జప్తిశివనూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి విందుకు 30 మందితో కామారెడ్డి జిల్లాలోని బాగీర్తిపల్లి నుంచి మల్కాపూర్​కు బయలుదేరిన వ్యాను జప్తిశివనూర్​ వద్ద బోల్తాపడింది. డ్రైవర్​ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నార్సింగి ఎస్​ఐ రాజేశ్​ తెలిపారు. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయని పేర్కొన్నారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు.

ప్రాథమిక చికిత్స కోసం బాధితులని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 10 మందిని హైదరాబాద్​ సూరారంలోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్​ఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాజేశ్​​ తెలిపారు.

ఇవీ చూడండి: పేలుడు పదార్థాలు తరలిస్తున్న మావోయిస్టు కొరియర్​ అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details