తెలంగాణ

telangana

ETV Bharat / state

రామాయంపేటలో 14 రోజుల పాటు స్వచ్ఛంద లాక్​డౌన్ - lockdown to stop spread of corona virus at medak

కరోనా మహమ్మారి వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో మెదక్ జిల్లా రామాయంపేట పురపాలక పరిధిలో వ్యాపారస్తులు శుక్రవారం నుంచి 14 రోజుల పాటు స్వచ్ఛంద లాక్​డౌన్ ప్రకటించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా విధించిన లాక్​డౌన్​ను ఎవరైనా అతిక్రమిస్తే భారీ జరిమానాలు ఉంటాయని మున్సిపల్ ఛైర్మన్ తెలిపారు.

lockdown at ramayampeta in medak district
రామాయంపేటలో 14 రోజులపాటు స్వచ్ఛంద లాక్​డౌన్

By

Published : Jul 31, 2020, 3:33 PM IST

మెదక్ జిల్లా రామాయంపేటలో ఇటీవల కాలంలో కరోనా వ్యాధిగ్రస్తులు పెరుగుతుండగా.. వ్యాపారస్థులు స్వచ్ఛంద బంద్​కు దిగారు. శుక్రవారం నుంచి 14 రోజులపాటు లాక్​డౌన్​ ప్రకటించారు. అన్ని వ్యాపార సముదాయాలను మూసివేశారు. గత కొద్దిరోజులుగా రామాయంపేటలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున వ్యాపారస్థులు బంద్ పాటించాలని నిర్ణయించారు.

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా 14 రోజుల పాటు లాక్​డౌన్​ ఉంటుందని.. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానాలు ఉంటాయని మున్సిపల్ ఛైర్మన్ తెలిపారు. కూరగాయలు, మందుల దుకాణాలు మినహా అన్ని మూసి ఉంచాలని కోరారు. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.

ఇదీ చూడండి:భారత్​కు రఫేల్​- వాయుసేనకు కొత్త శక్తి

ABOUT THE AUTHOR

...view details