తెలంగాణ

telangana

ETV Bharat / state

శివాజీనగర్​లో ఐదో కొండ చిలువ ప్రత్యక్షం...

మంచిర్యాల జిల్లాలో శివాజీనగర్ తో పాటు రామాలయం కాలనీలో నెల రోజుల వ్యవధిలో 5 కొండచిలువలు పట్టుబడడం... కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

By

Published : Jul 23, 2020, 12:44 PM IST

భారీ కొండచిలువను పట్టుకున్న యువకులు
భారీ కొండచిలువను పట్టుకున్న యువకులు

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ శివాజీనగర్ లో భారీ కొండచిలువ కలకలంరేపింది. తెల్లవారుజామున కొండచిలువ కాలనీలోకి చొరబడుతుండగా గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. యువకులు కష్టం మీద కొండచిలువను పట్టుకున్నారు.

శివాజీనగర్ తో పాటు రామాలయం కాలనీలో నెల రోజుల వ్యవధిలో 5 కొండచిలువలు పట్టుబడడం... కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. పట్టుబడిన కొండచిలువను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details