తెలంగాణ

telangana

By

Published : Nov 13, 2019, 6:51 PM IST

ETV Bharat / state

ముఖ్యమంత్రి​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలి: వివేక్​

ముఖ్యమంత్రిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని మాజీ ఎంపీ వివేక్​ డిమాండ్​ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కారణమవుతున్నారని ఆరోపించారు.

కేసీఆర్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలి: వివేక్​

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. మాజీ ఎంపీ వివేక్ ముఖ్య అతిథిగా హాజరై యాత్రను ప్రారంభించారు. సీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున... ముఖ్యమంత్రి కేసీఆర్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. ఆర్టీసీని ఏ చట్టం ప్రకారం ప్రైవేటీకరిస్తారో చెప్పాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రమంతా కల్వకుంట్ల కుటుంబమే ఉండాలని కేసీఆర్​ కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్​ స్వరూప పాల్గొన్నారు.

కేసీఆర్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలి: వివేక్​

ABOUT THE AUTHOR

...view details