తెలంగాణ

telangana

ఊరికోసం సొంత ఖర్చులతో ఎన్​ఆర్​ఐ సేవలు.!

పుట్టిన ఊరుకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో.. ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్​, మినరల్​ వాటర్​ ప్లాంట్​ను అందించారు ఎన్​ఆర్​ఐ గుండా అమర్​నాథ్. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో వీటిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​, ఎమ్మెల్యే దివాకర్​ రావు ప్రారంభించారు.

By

Published : Feb 21, 2021, 7:58 PM IST

Published : Feb 21, 2021, 7:58 PM IST

lakshettipeta
ఊరికోసం ఎన్​ఆర్​ఐ సేవలు

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి ప్రవాస భారతీయుడు గుండా అమరనాథ్ రూ. 20 లక్షల విలువైన అంబులెన్స్, రూ. 5 లక్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్​ ఏర్పాటు చేశారు. వీటిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు.

లక్షెట్టిపేట కొత్తూరు గ్రామానికి చెందిన గుండా అమర్​నాథ్​ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. తను పుట్టి పెరిగిన గ్రామానికి ఏదైనా చేయాలనే సామాజిక స్పృహతో.. గ్రామ ప్రజల దాహార్తి తీర్చాలని భావించారు. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ సహకారంతో రూ. 5 లక్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్​ను ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రభుత్వాస్పత్రికి రోగుల సౌకర్యార్థం రూ. 20 లక్షల అంబులెన్స్, మరో 5 లక్షలతో ఇతర మిషనరీని అందించారు. ఇదే స్ఫూర్తితో సొంత గ్రామాలకు సాయం చేయాలని భావిస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందని వినోద్ కుమార్ అన్నారు. దాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఊరికోసం సొంత ఖర్చులతో ఎన్​ఆర్​ఐ సేవలు.!

ఇదీ చదవండి:నడ్డా సమక్షంలో భాజపాలో చేరిన శ్రీశైలం గౌడ్‌

ABOUT THE AUTHOR

...view details