తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన​ సయ్యద్-షా-బాబా ఉర్సు ఉత్సవాలు - Telangana Latest News

చెన్నూర్​లో రెండు రోజులుగా జరుగుతున్న సయ్యద్-షా-బాబా ఉర్సు ఉత్సవాలు గురువారం రాత్రి అట్టహాసంగా ముగిసాయి. పట్టణంలోని పెద్ద మసీదు వద్ద ఉన్న దర్గా నుంచి విశ్రాంతి భవనం వద్ద గల దర్గా వరకు గంధం ఊరేగింపు నిర్వహించారు. మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

Syed-Shah-Baba Ursu celebrations ended
ముగిసిన​ సయ్యద్-షా-బాబా ఉర్సు ఉత్సవాలు

By

Published : Mar 12, 2021, 9:54 AM IST

మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో మత సామరస్యానికి ప్రతీకగా రెండు రోజులుగా జరుగుతున్న సయ్యద్-షా-బాబా ఉర్సు ఉత్సవాలు గురువారం రాత్రి అట్టహాసంగా ముగిసాయి. పట్టణంలోని పెద్ద మసీదు వద్ద ఉన్న దర్గా నుంచి విశ్రాంతి భవనం వద్ద గల దర్గా వరకు గంధం ఊరేగింపు నిర్వహించారు.

ఉత్సవాలకు పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కవాలి కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. దర్గా ప్రాంతంలో దుకాణాలు వెలువడడంతో పండుగ వాతావరణం నెలకొంది.

భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు, మున్సిపాలిటీ వైస్​ఛైర్మన్ నవాజొద్దీన్, అధ్యక్షుడు ఖాజా ఖంరొద్దీన్, జాఫర్ అలీ ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:జూబ్లీహిల్స్ శ్రీ‌ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details