తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2021, 12:19 PM IST

ETV Bharat / state

తెలంగాణ జాగృతి క్రికెట్ పోటీలు ప్రారంభం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 12 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. యువత చెడు వ్యసనాలకు గురికాకుండా ఉండేందుకే క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

telangana-jagruthi-cricket-tournament-inaugurated-by-mla-diwakar-rao-in-mancherial-district
తెలంగాణ జాగృతి క్రికెట్ కప్ పోటీలు ప్రారంభం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న తెలంగాణ జాగృతి క్రికెట్ కప్ 2020-21 పోటీలను ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 క్రికెట్ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

యువత చెడు వ్యసనాలకు గురికాకుండా, ఐకమత్యంతో ఉండేందుకే క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. విద్య, క్రీడా రంగాల్లో రాణించి ఉన్నత ఉద్యోగాలను సాధించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి:రజనీ రాజకీయ నిర్ణయంపై అభిమానుల నిరసన

ABOUT THE AUTHOR

...view details