లాక్డౌన్ కారణంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పరిసర ప్రాంతాల్లో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తోన్న 50 మంది ఆటో డ్రైవర్లను ఆర్కే-06 సింగరేణి గని యువ కార్మికులు ఆదుకున్నారు. సింగరేణి కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి చేతుల మీదుగా నిత్యావసరాలు పంపిణీ చేశారు.
సింగరేణి యువ కార్మికుల ఆధ్వర్యంలో నిత్యాసరాల పంపిణీ - ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఆర్కే-06 సింగరేణి గని యువ కార్మికులు
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో లాక్డౌన్తో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు ఆర్కే-06 సింగరేణి గని యువ కార్మికులు.
సింగరేణి యువ కార్మికుల ఆధ్వర్యంలో నిత్యాసరాల పంపిణీ
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆకలితో అలమటిస్తోన్న పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సింగరేణి యువ కార్మికులు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు.
ఇదీ చూడండి:కుష్టు వ్యాధి వ్యాక్సిన్తో కరోనా చికిత్స!