మంచిర్యాల జిల్లా మందమర్రిలో 23 మంది సింగరేణి తొలగింపు కార్మికులు నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, సింగరేణి కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదిహేనేళ్లుగా పోరాటం చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.
నీళ్ల ట్యాంక్ ఎక్కి సింగరేణి తొలగింపు కార్మికుల నిరసన
తమకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని సింగరేణి తొలగింపు కార్మికులు మంచిర్యాల జిల్లా మందమర్రిలో నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదన్నారు.
ట్యాంక్ ఎక్కిన కార్మికులు