తెలంగాణ

telangana

ETV Bharat / state

నీళ్ల ట్యాంక్​ ఎక్కి సింగరేణి తొలగింపు కార్మికుల నిరసన

తమకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని సింగరేణి తొలగింపు కార్మికులు మంచిర్యాల జిల్లా మందమర్రిలో నీళ్ల ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపారు. విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదన్నారు.

By

Published : Jul 31, 2019, 5:37 PM IST

ట్యాంక్​ ఎక్కిన కార్మికులు

మంచిర్యాల జిల్లా మందమర్రిలో 23 మంది సింగరేణి తొలగింపు కార్మికులు నీళ్ల ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపారు. తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం, సింగరేణి కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదిహేనేళ్లుగా పోరాటం చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.

నీళ్ల ట్యాంక్​ ఎక్కిన సింగరేణి తొలగింపు కార్మికులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details