రాష్ట్ర ఆవిర్భావం వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, కలెక్టర్ భారతీ హోలీ కేరి, ఎమ్మెల్యే దివాకర్ నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాజీవ్ శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరులు కుటుంబాలను సన్మానించారు.
మంచిర్యాలలో జెండా ఎగురేసిన ప్రభుత్వ సలహాదారు - rajeev sharma
మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ బాలుర మైదానంలో ఏర్పాటుచేసిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మంచిర్యాలలో జెండా ఎగురేసిన ప్రభుత్వ సలహాదారు