పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని మంచిర్యాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీసులకు జోహార్లు తెలిపారు. అమరుల ఆత్మశాంతి కలగాలని స్వచ్ఛందంగా యువకులు, పోలీసులు రక్తదానం చేశారు.
పోలీసుల రక్తదాన శిబిరం.. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువత - blood donation camp
మంచిర్యాలలో పోలీసులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువకులు, పోలీసులు స్వచ్ఛందంగా రక్తం ఇచ్చారు.
![పోలీసుల రక్తదాన శిబిరం.. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువత Police Mega Blood Camp in manchiryal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9244217-354-9244217-1603185991083.jpg)
Police Mega Blood Camp in manchiryal
తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 వేలకు పైగా బాధితులు రక్తం సరైన సమయంలో అందక ఇబ్బందులు పడుతున్నారని సీపీ సత్యనారాయణ వివరించారు. రక్తనిధి కేంద్రాలలో రక్త నిలువలను పెంచడం కోసమే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.