తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులమని బెదిరించి రూ.9 లక్షల 50 వేలు వసూలు - manchiryala crime news

సినీ ఫక్కీలో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్నారు మంచిర్యాల పోలీసులు. ఈ నెల 5న మంచిర్యాల స్థానిక ర్వైల్వేస్టేషన్​ వద్ద రాజస్థాన్​కు చెందిన మేకల వ్యాపారులను నలుగురు దుండగులు పోలీసులమని బెదింరించి 9 లక్షల 50 వేల రూపాయలు వసూలు చేశారు.

police catch  Thieves in manchiryala
పోలీసులమని బెదిరించి రూ.9 లక్షల 50 వేలు వసూలు

By

Published : Jan 17, 2020, 5:59 PM IST

ఈ నెల 5న మంచిర్యాల రైల్వే స్టేషన్ ఎదుట రాజస్థాన్​కు చెందిన మేకల వ్యాపారుల నుంచి అదే ప్రాంతానికి చెందిన వికాస్ శర్మ, పెద్దపెల్లి జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు డబ్బులు వసూలు చేశారు. తాము పోలీసులమంటూ బెదింరించి రూ.9 లక్షల 50 వేలు కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.4 లక్షల 30 వేలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ ఉదయ్​ కుమార్​ రెడ్డి తెలిపారు.

పోలీసులమని బెదిరించి రూ.9 లక్షల 50 వేలు వసూలు

ABOUT THE AUTHOR

...view details