మార్వాడీ ప్రగతి సమాజ్ సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరుపేద జంటలకు సామూహికంగా వివాహాలు జరిపించారు. పెళ్లిళ్లు చేసుకునే ఆర్థిక స్తోమత లేని నిరుపేదలకు బాసటగా మార్వాడీలు నిలిచారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా తాము నిరుపేద జంటలను ఎంపిక చేసి వివాహాలు జరిపించాలని నిర్ణయించుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు - మంచిర్యాలలో సామూహిక వివాహాలు
మంచిర్యాలలో నిరుపేదలకు మార్వాడీలు సామూహిక వివాహాలు నిర్వహించారు.
![నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5004125-thumbnail-3x2-df.jpg)
సామూహిక వివాహాలు