తెలంగాణ

telangana

ETV Bharat / state

మందమర్రిలో ప్రియుడి చేతిలో హతమైన వివాహిత

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో వివాహిత హత్య కలకలం రేపుతోంది. వివాహితను గొంతు కోసి చంపి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Jun 9, 2020, 2:34 PM IST

Updated : Jun 9, 2020, 2:39 PM IST

Married Women Suspected Die In Manchiryal
ప్రియుడి చేతిలో హతమైన వివాహిత

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పులిమడుగు గ్రామంలో షేక్​ సల్మా హత్య కలకలం రేపింది. దేవపూర్​కి చెందిన సల్మాతో పులిమడుగు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్​ కమలాకర్​తో పరిచయం ఏర్పడింది. క్రమంగా ప్రేమగా మారి.. శారీరక సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత హైదరాబాద్​కు చెందిన యువకునితో సల్మాకు వివాహం కుదిరింది. ఆ తర్వాత కూడా సల్మా కమలాకర్​తో సంబంధం కొనసాగించింది. పెళ్లి కంటే ముందే మరో యువకుడితో సంబంధం ఉందని తెలుసుకున్న సల్మా భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు.

అప్పటి నుంచి సల్మా తాను ప్రేమించిన యువకుడితో కొన్ని నెలలుగా రామకృష్ణాపూర్​లో కలిసి ఉంటోంది. సోమవారం రాత్రి కమలాకర్​, సల్మా మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. సహనం కోల్పోయిన కమలాకర్​ చేతికి అందిన పదునైన ఆయుధంతో సల్మా గొంతుకోసి హత్య చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న రామకృష్ణాపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :ప్రతిధ్వని: స్కూళ్లు తెరుచుకుంటాయా.. తరగతుల నిర్వహణ సాధ్యమేనా?

Last Updated : Jun 9, 2020, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details