తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులకు పరీక్షలంటే భయం పోవాలి: జీఎం రమేష్​రావు - విద్యార్థులకు పరీక్షలంటే భయం పోవాలి

పరీక్షలంటే విద్యార్థులకు భయం పోవాలని సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జీఎం రమేష్​రావు సూచించారు. విద్యార్థులకు హాల్​టికెట్లు, పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు.

singareni school
విద్యార్థులకు పరీక్షలంటే భయం పోవాలి: జీఎం రమేష్​రావు

By

Published : Mar 17, 2020, 11:33 PM IST

పరీక్షలంటే విద్యార్థులకు భయం పోవాలని సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జీఎం రమేష్​రావు అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి పాఠశాలలో విద్యార్థులకు హాల్​ టికెట్లు పంపిణీ చేశారు. సొంత ఖర్చుతో విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు.

తక్కువ ఫీజుతో సింగరేణి విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు రమేష్​రావు తెలిపారు. విద్యార్థులంతా మంచి మార్కులు సాధించి.. వారి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం పరీక్ష విధానంపై పలు సూచనలు చేశారు.

విద్యార్థులకు పరీక్షలంటే భయం పోవాలి: జీఎం రమేష్​రావు

ఇవీచూడండి:'మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు'

ABOUT THE AUTHOR

...view details