తెలంగాణ

telangana

ETV Bharat / state

యాచకులకు మున్సిపల్ సిబ్బంది సాయం - యాచకులకు మున్సిపల్ సిబ్బంది సాయం

యాచకులకు మంచిర్యాల మున్సిపల్ సిబ్బంది సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. భిక్షాటన చేస్తూ బతికే వారికి పండ్లు, ఆహారాన్ని అందించారు.

FOOD DISTRIBUTION
FOOD DISTRIBUTION

By

Published : May 21, 2021, 7:09 PM IST

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని యాచకులకు.. మున్సిపాలిటీ సిబ్బంది ఆహారం అందించి ఉదారతను చాటుకున్నారు. రెండోదశలో కొవిడ్ విజృంభిస్తున్న విపత్కర సమయంలో యాచకులు ఆహారం లేకుండా రైల్వే స్టేషన్​లో బిక్కుబిక్కుమంటూ.. కాలం వెళ్లదీస్తున్నారు.

వారిని గుర్తించిన మున్సిపాలిటీ కమిషనర్​ స్వరూపారాణి తమ కార్యాలయ సిబ్బంది సహకారంతో 53వేల రూపాయలు జమ చేసి.. భిక్షాటన చేస్తూ బతికే వారికి పండ్లు, ఆహారాన్ని అందించారు. లాక్​డౌన్​ వేళ ఆహారం లేక ఇబ్బందులకు గురవుతున్న వారికి స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారాలను అందించాలని కోరారు.

ఇదీ చదవండి:సెంట్రల్​ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట

ABOUT THE AUTHOR

...view details