మంచిర్యాల జిల్లాలో కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తికి మున్సిపల్ వైస్ ఛైర్మన్ అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలో రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులెవరూ ఆయన దహన సంస్కారాలు చేయడానికి ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో మంచిర్యాల పురపాలక సంస్థ వైస్ ఛైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ తగు రక్షణ చర్యలు పాటించి మృతుడికి దహన సంస్కారాలు నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు.
కొవిడ్తో మృతిచెందిన వ్యక్తికి.. అంత్యక్రియలు చేసిన ప్రజా ప్రతినిధి!
కరోనాతో సోకిన బాధితులను, పాజిటివ్ వచ్చి మృతి చెందిన వారిని కుటుంబ సభ్యులు, అయినవారే పట్టించుకోవడం లేదు. అలాంటిది మంచిర్యాల జిల్లాలో కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తికి మున్సిపల్ వైస్ ఛైర్మన్ అంత్యక్రియలు నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి.. మనోధైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు.
కొవిడ్తో మృతిచెందిన వ్యక్తికి.. అంత్యక్రియలు చేసిన ప్రజా ప్రతినిధి!