రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాలలో వలస కూలీలకు పోలీసులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ హాజరై కూలీలకు ఆహారం వడ్డించారు. సీఎం కేసీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోశ్కుమార్ ఆదేశాలతో రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీపీ తెలిపారు.
వలస కూలీలకు పోలీసుల అన్నదానం - Corona Lockdown Migrant Workers
లాక్డౌన్ వల్ల అవస్థలు పడుతున్న వలస కూలీలకు మంచిర్యాల పోలీసులు అన్నదానం చేశారు. సీఎం కేసీఆర్, ఎంపీ సంతోశ్కుమార్ ఆదేశాల మేరకు వలస కార్మికులకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు.

పోలీసుల అన్నదానం
వలస కార్మికులెవరూ ఆకలితో రాష్ట్ర సరిహద్దులు దాటకూడదని ఆయన అన్నారు. అవసరమైతే వారికి ప్యాకింగ్ ఆహారం, చిన్నపిల్లలకు బిస్కెట్లు, స్నాక్స్ లాంటివి అందించనున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కొందరు కార్మికులు నడుచుకుంటూ వెళ్తున్నారని... కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా... మరికొందరు అనుమతులు తీసుకుని వాహనాల్లో వెళ్తున్నారని చెప్పారు.
ఇదీ చూడండి:కాంక్రీట్ మిక్సర్ ట్యాంక్లో 18 మంది కూలీల ప్రయాణం