మంచిర్యాల జిల్లా కస్తూర్బా గాంధీ పాఠశాల పచ్చదనాన్ని పరుచుకుంది. ఎటు చూసినా మొక్కలతో నిండి పోయింది. కస్తూర్బా పాఠశాలలో ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుల పుట్టిన రోజున మొక్కలు నాటుతారు. ఇప్పటి వరకు 600 రకాల మొక్కలు నాటారు. ప్రతి శనివారం ఇక్కడ విద్యార్థులు తోట పని చేస్తుంటారు. ఇటీవల ఆకుకూరలతోపాటు కూరగాయల సాగును ప్రారంభించారు.
మొక్కల దత్తత
పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాలుగు మొక్కలను దత్తత ఇచ్చారు. ఈ మొక్కలకు నీరు పోస్తూ సంరక్షించాల్సిన బాధ్యత ఆ విద్యార్థులపై ఉంటుంది. పట్నం బంతి మొక్కలు పెరగడం వల్ల పాఠశాల కొత్త శోభను సంతరించుకుంది. ప్రకృతి అందాలను చూసిన తల్లిదండ్రులు, విద్యార్థులు మంత్ర ముగ్ధులవుతున్నారు.