Young man died in Sydney: దేశం కాని దేశంలో రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన 27 ఏళ్ల కుమారుడి కడసారి చూపు కోసం ఆ కుటుంబం దీనంగా ఎదురుచూస్తోంది. అసలే నిరుపేద కుటుంబం.. ఆపై ఆర్థిక ఇబ్బందులు. తమ కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడి చదువుకుని.. త్వరలో మంచి కొలువు సాధించి ఉన్నత స్థానంలో ఉండాల్సిన కుమారుడు.. నిర్జీవంగా మిగిలాడని తెలిసి తల్లిదండ్రులు, తోబట్టువులు తల్లడిల్లిపోతున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన 27 ఏళ్ల రాజు.. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన స్థానికులను కలచివేసింది.
విధి వక్రించింది
రాజుకు చిన్నప్పటి నుంచి విదేశాల్లో చదువుకుని ఉన్నత స్థితిలో నిలబడాలని కల. కానీ అతనిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కొమురయ్య, కమలమ్మ.. గ్రామంలో ఓ చిన్న గిర్నీ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆదాయం అంతంతమాత్రమే. రాజుకు ఓ చెల్లి, తమ్ముడు ఉన్నారు. రాజుకు చదువు పట్ల ఉన్న అమితమైన ఇష్టమే.. అతనికి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఎమ్ఐటీలో మాస్టర్స్ పూర్తి చేసేలా చేసింది. మాస్టర్స్ పూర్తయ్యాక.. ప్రస్తుతం తాత్కాలిక వీసాపైన సిడ్నీలోనే ఉంటున్నాడు. మరి కొద్ది రోజులైతే మంచి కొలువు సాధించేవాడు. ఈ క్రమంలోనే.. విధి అతని జీవితంపై చిన్న చూపు చూసింది.
స్నేహితులను కాపాడేందుకు వెళ్తే