తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాలలో కిటకిటలాడిన బంగారం దుకాణాలు

అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే సిరిసంపదలు కలుగుతాయని ప్రజల విశ్వాసం. అందుకే ఈరోజు పసిడి కొనుగోలు చేసేందుకు మంచిర్యాలలో ప్రజలు బారులు తీరారు.

By

Published : May 7, 2019, 8:00 PM IST

పసిడి కొనుగోలు


అక్షయ తృతీయ పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో బంగారు నగల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆభరణాలపై డిస్కౌంట్లు ప్రకటించారు. అక్షయ తృతీయ రోజు పసిడి కొనుగోలు చేస్తే అంతా మంచే జరుగుతుందని ప్రజల నమ్మకం. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచే ప్రజలు జువెలరీ షాపులకు బారులు తీరారు.

కిటకిటలాడిన బంగారం దుకాణాలు

ABOUT THE AUTHOR

...view details