రహదారులపై ప్రమాదాలతో మృత్యువాత పడుతున్న జంతువుల కళేబరాలను ఖననం చేయాలనే ఉద్దేశంతో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపట్టారు. ట్రస్ట్ నిర్వాహకుడు సందేశ్ గుప్తా, అతని స్నేహితుడు నరేష్ సైకిల్పై వారణాసి వరకు యాత్రగా బయలుదేరారు. యాత్రి దిగ్విజయంగా కొనసాగాలని స్థానికులు హనుమాన్ ఆలయంలో పూజలు చేసి వీడ్కోలు పలికారు. మరికొంతమంది యాత్రకు ఆర్థిక సాయం అందించారు.
ప్రధాన రహదారులపై వాహనాలు ఢీకొని పశువులు, జంతువులు అక్కడికక్కడే మృతి చెందుతున్నాయి. మనం కనీస బాధ్యతగా కూడా చూడటం లేదు. రహదారులపై చనిపోయిన జంతు కళేబరాలను వదిలి వెళ్లడం వల్ల పశువులకు, వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ యాత్ర చేపట్టాం.
-సందేశ్ గుప్తా, ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ నిర్వాహకుడు, మంచిర్యాల