తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​ ఎదుట యువరైతు ఆత్మహత్యాయత్నం - farmer suicide attempt

మంచిర్యాల కలెక్టరేట్​ ఎదుట నేన్నల మండలానికి చెందిన యువరైతు సాయికుమార్​ ఆత్మహత్యకు యత్నించారు. తమ భూమిని మందమర్రికి చెందిన వ్యక్తి తన పేరు మీద రాయించుకున్నాడని తెలిపాడు. ఎన్నిసార్లు అధికారుల చుట్టు తిరిగినా తనకు న్యాయం జరగలేదని వాపోయాడు.

కలెక్టరేట్​ ఎదుట యువరైతు ఆత్మహత్యాయత్నం

By

Published : Aug 5, 2019, 7:14 PM IST

మంచిర్యాల కలెక్టరేట్​ ఎదుట నేన్నల మండలానికి చెందిన యువరైతు సాయికుమార్​ ఆత్మహత్యకు యత్నించాడు. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న తమ భూమిని మందమర్రి పట్టణానికి చెందిన వ్యక్తి తన పేరు మీద పట్టా చేయించుకున్నారని తెలిపాడు. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేశాడు. కిరోసిన్​ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అడ్డుకున్న పోలీసులు.. సాయికుమార్​ను ఏవో సురేష్​ వద్దకు తీసుకెళ్లారు. సాధ్యమైనంత వేగంగా సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఏవో తెలిపారు.

కలెక్టరేట్​ ఎదుట యువరైతు ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details