తెలంగాణ

telangana

ETV Bharat / state

టెస్టుల కోసం కరోనా బాధితులు రాస్తారోకో - తెలంగాణ వార్తలు

ఇప్పటివరకు రకరకాల కారణాలతో రాస్తారోకో నిర్వహించడం చూశాం. అయితే తాజాగా కరోనా టెస్టుల కోసం బాధితులు రోడ్డెక్కిన పరిస్థితి.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ పీహెచ్​సీ వద్ద నెలకొంది. రికమండేషన్ ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. పీహెచ్​సీకి వచ్చిన వారందరికీ టెస్టులు చేయాలంటూ రోడ్డెక్కారు.

Corona victims Rastaroko, Rastaroko for tests, hajipur phc
Corona victims Rastaroko, Rastaroko for tests, hajipur phc

By

Published : May 8, 2021, 6:10 PM IST

మంచిర్యాల జిల్లా హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట బాధితులు రాస్తారోకో నిర్వహించారు. కొవిడ్​ లక్షణాలతో వచ్చిన తమకు నిర్ధరణ పరీక్షలు చేయడం లేదంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు.

నాలుగు రోజుల నుంచి ఆసుపత్రి చుట్టూ తిరిగినా టెస్టులు చేయడం లేదని.. కేవలం 10, 20 మందికే నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. టెస్ట్ కిట్లు లేవని చెప్తూ.. కొవిడ్ బాధితుల పట్ల సిబ్బంది నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పాజిటివ్ వచ్చిన వారికి క్వారంటైన్ సమయం అయిపోయిన తర్వాత మళ్లీ టెస్టులకు వెళ్తే నిరాకరిస్తున్నారని తెలిపారు.

అధికార పార్టీ మండల నాయకుల రికమండేషన్ ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. పీహెచ్​సీకి వచ్చిన వారందరికీ టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను సముదాయించి రాస్తారోకో విరమించేలా చేశారు. టెస్టులు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో వారంతా ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి: డీఆర్​డీఓ కొవిడ్​ ఔషధానికి డీసీజీఐ అనుమతి

ABOUT THE AUTHOR

...view details