తెలంగాణ

telangana

ETV Bharat / state

'హరితహారంలో సింగరేణి భేష్​'

హరితహారంలో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ అన్నారు. మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్​ రోడ్డులోని రిజర్వ్​ ఫారెస్ట్​లో సింగరేణి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.

By

Published : Jul 31, 2019, 11:57 PM IST

మొక్క నాటుతున్న సుమన్​

మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం ఇందారం క్రాస్​ రోడ్డులోని రిజర్వ్​ ఫారెస్ట్​లో సింగరేణి ఆధ్వర్యంలో హరితహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు, మంచిర్యాల ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్​ రావు, జడ్పీ ఛైర్మన్​ లక్ష్మి​ తదితరులు పాల్గొన్నారు. హరితహారంలో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తోందని సుమన్​ అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.

'హరితహారంలో సింగరేణి భేష్​'

ABOUT THE AUTHOR

...view details