మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డులోని రిజర్వ్ ఫారెస్ట్లో సింగరేణి ఆధ్వర్యంలో హరితహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు, మంచిర్యాల ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్ రావు, జడ్పీ ఛైర్మన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హరితహారంలో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తోందని సుమన్ అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.
'హరితహారంలో సింగరేణి భేష్'
హరితహారంలో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్ రోడ్డులోని రిజర్వ్ ఫారెస్ట్లో సింగరేణి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
మొక్క నాటుతున్న సుమన్