తెలంగాణ

telangana

ETV Bharat / state

'సింగరేణి కార్మికులకు పదిశాతం హెచ్​ఆర్​ఏ చెల్లించాలి'

సింగరేణి వ్యాప్తంగా ఏర్పడ్డ నూతన మున్సిపాలిటీల్లో సింగరేణి కార్మికులకు 10 శాతం ఇంటి కిరాయి చెల్లించాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. వారి సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

By

Published : Dec 22, 2020, 3:59 PM IST

AITUC relay strike solution for Singareni workers
సింగరేణి కార్మికులకు పరిష్కారం కోసం ఏఐటియూసీ రిలే నిరాహార దీక్ష

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికసంఘం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 10 శాతం హెచ్ఆర్ఏను కార్మికులకు చెల్లించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు.

2018 ఆగస్టు నుంచి సింగరేణి వ్యాప్తంగా ఏర్పడిన నూతన మున్సిపాలిటీల్లో.. సింగరేణి కార్మికులకు 10 శాతం ఇంటి కిరాయితో పాటు కార్మికులకు చెల్లించాల్సిన ఏరియస్ డబ్బులను వెంటనే యాజమాన్యం చెల్లించాలని కోరారు.

ఇదీ చూడండి:'కొత్త వైరస్​ వచ్చిందని భయపడకండి.. అప్రమత్తంగా ఉండండి'

ABOUT THE AUTHOR

...view details