కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించలేనంతగా పెరిగిపోతోంది. మంచిర్యాల జిల్లాలో 322 కేసులు నమోదు కావడం మహమ్మారి ఉద్ధృతికి అద్దం పడుతోంది. 1241 మందికి పరీక్షలు చేయగా 322 మంది కొవిడ్ బారిన పడ్డారు.
మంచిర్యాలలో 322 కరోనా పాజిటివ్ కేసులు - corona cases in telangana
మంచిర్యాల జిల్లాల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో కొత్తగా మరో 322 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 35 మంది కొవిడ్ బారినపడి మరణించారు.
![మంచిర్యాలలో 322 కరోనా పాజిటివ్ కేసులు 322 positive cases in manchiryala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8558732-61-8558732-1598406802634.jpg)
322 positive cases in manchiryala
మృతుల సంఖ్య 35కు చేరుకుంది. కరోనా పరీక్షలు చేసుకోవడానికి ప్రజలంతా పోటీపడుతున్నారు. జిల్లాలో రోజూ 1000 మందికి పైగానే పరీక్షలు చేయించుకుంటున్నారు.