తెలంగాణ

telangana

ETV Bharat / state

పూజల పేరుతో మహిళల నగ్నచిత్రాలు తీసిన ముఠా అరెస్టు.. పరారీలో ప్రధాన నిందితుడు

womens nude photos scam in mahabhubnagar: పూజకు ఎంపికైతే కోట్లు వచ్చిపడతాయి. కాని ఎంపిక కావాలంటే శరీరాకృతి చూపే నగ్నఫోటోలు ఇవ్వాలని నమ్మించి సుమారు 25 మంది మహిళల ఫోటోలు సేకరించిన ముఠాను మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతణ్ని పట్టుకుంటే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని జడ్చర్ల సీఐ రమేష్ బాబు వెల్లడించారు.

By

Published : Mar 11, 2023, 8:41 PM IST

nude photos scam
nude photos scam

womens nude photos scam in mahabhubnagar: పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతులను లక్ష్యంగా చేసుకొని మోసగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. ఇంతకీ దందా ఏమిటంటే ముందుగా తాము ఎంచుకున్న మహిళతో డబ్బు ఎర చూపి మాటలు కలుపుతారు. ఎదో రకంగా ఆమెను ఒప్పుకునేలా మాయ మాటలు చెప్పి నగ్న చిత్రాలు కావాలంటారు వాటిని హైదరాబాద్​లోని తమ గురువుకి పంపితే డబ్బులు వస్తాయంటూ నమ్మిస్తారు.

పూజకు ఎంపికైతే కోట్లు సంపాదించవచ్చు. కానీ అందుకు ఎంపిక కావాలంటే శరీరాకృతి చూపే నగ్నఫొటోలు ఇవ్వాలి. అలా మాయ మాటలు చెప్పి సుమారు 25 మంది అమాయక మహిళల నగ్నచిత్రాలు సేకరించిన ముఠాను మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 18న జడ్చర్లలోని పాతబజారులో గొడవ జరుగుతుందని డయల్-100కు ఫోన్ కాల్​​ చేశారు. అక్కడి ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఓ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొదట జైనుల్లావుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ చిత్రాలు తీశారన్న ఆరోపణపై విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వనపర్తికి చెందిన జైనుల్లావుద్దీన్ జడ్చర్లలో అద్దెకు నివాసం ఉంటున్నారు. ఆయనతో పాటు రాములు, శంకర్ అలీ, రాములు నాయక్ కలిసి మహిళల శరీరాకృతికి సంబంధించి నగ్న చిత్రాలు సేకరిస్తున్నారు. నిరుపేద మహిళల్ని డబ్బు ఎరగా చూపి తమకు తెలిసిన గురువు ఉన్నారని.. ఆయన పూజకు ఎంపిక చేస్తే కోట్లలో డబ్బులు వస్తాయని ఆశచూపారు. పూజకు ఎంపిక కావాలంటే శరీరాకృతికి చెందిన నగ్నఫొటోలు తిరుపతి అనే వ్యక్తికి పంపాలని చెప్పారు.

అలా 2 నెలలుగా 20 నుంచి 25మంది మహిళల నగ్న ఫొటోలను సేకరించి తిరుపతి అనే వ్యక్తికి పంపినట్లు దర్యాప్తులో తేలింది. అయితే పంపిన ఫొటోలు తిరుపతి ఏం చేస్తాడు ? తిరుపతి చెప్పిన గురువు ఎవరు ? ఈ ఫొటోలతో ఏం చేస్తారన్నది నిజం తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ముఠాలోని నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తిరుపతి అనే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని, అతణ్ని విచారిస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయని జడ్చర్ల సీఐ రమేష్ బాబు తెలిపారు.

జడ్చర్లలో ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. ప్రధాన నిందితుడు తిరుపతి అరెస్ట్ అయితే గానీ ఈ కేసులో కీలక ప్రశ్నలకు చిక్కుముడి వీడదు. పోలీసులు మాత్రం తిరుపతి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details