సద్గురు త్యాగరాజు గానామృతానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ నాయి బ్రాహ్మణుల గానామృత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
దేవరకద్రలో ఘనంగా త్యాగరాజు ఆరాధనోత్సవాలు - దేవరకద్రలో త్యాగరాజు ఆరాధనోత్సవాలు
సద్గురు త్యాగరాజు ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో నాయి బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలతో గానామృతం వినిపించారు. స్వర లహరి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో వాయిద్యాకారులను సన్మానించారు.
![దేవరకద్రలో ఘనంగా త్యాగరాజు ఆరాధనోత్సవాలు Tyagaraja worships are celebrated in Devarakadra in mahaboobnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10651130-365-10651130-1613478128015.jpg)
దేవరకద్రలో ఘనంగా త్యాగరాజు ఆరాధనోత్సవాలు
స్వరలహరి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో వాయిద్యకారులను అకాడమీ ప్రతినిధి, విశ్రాంత పోలీస్ అధికారి బాగన్న గౌడ్ సన్మానించారు. త్యాగరాజు శిష్యులుగా నాయి బ్రాహ్మణులు అందిస్తున్న గానామృతం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.