మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ఎక్కడ కనిపించినా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సమ్మె విరమించి విధుల్లో చేరతామని ప్రకటించినా ఆర్టీసీ యాజమాన్యం తమను చేర్చుకోవట్లేదంటూ వాపోయారు.
ఆత్మహత్యే శరణ్యమని మహిళల కంటతడి
సమ్మె విరమించి విధుల్లో చేరతామని ప్రకటించినా ఆర్టీసీ యాజమాన్యం తమను విధుల్లో చేర్చుకోవట్లేదంటూ మహబూబ్నగర్లో మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.
ఆత్మహత్యే శరణ్యమని మహిళల కంటతడి
జిల్లా కేంద్రంలో ఉదయం వ్యాయామం, యోగ, వాకింగ్ కోసం వెళ్లిన మహిళలను పోలీసులు వెంబడించి అరెస్టు చేశారు. తమను విధుల్లో చేర్చుకోవాలని... ఉద్యోగాలు లేని జీవితాలు తమకు వద్దని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యోగాలు లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: డిపోలకు వస్తున్న కార్మికులు... అడ్డుకుంటున్న పోలీసులు..