తెలంగాణ

telangana

By

Published : Nov 8, 2019, 6:46 PM IST

ETV Bharat / state

కాంగ్రెస్ కలెక్టరేట్ ముట్టడి... ఉద్రిక్తత

మహబూబ్​నగర్​లో కాంగ్రెస్ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తత దారితీసింది.

పాలమూరు కలెక్టరేట్​ ముట్టడి

మహబూబ్​నగర్ కలెక్టరేట్​ ముట్టడి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. మహబూబ్​నగర్ ఆర్అడ్బీ అతిథి గృహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన శ్రేణులు కలెక్టరేట్ ప్రాంగణంలోకి చొచ్చుకువచ్చాయి. జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్​నగర్ నియోజకవర్గాల నుంచి నాయకులు రాగా, ఎన్​ఎస్​యూఐ విద్యార్థులు కలెక్టరేట్​ను ముట్టడించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలన కారణంగా దేశం, రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఏర్పడిందని... ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు అణచివేతతో ప్రజాగ్రహాన్ని చల్లార్చలేరన్నారు. అనంతరం చల్లా వంశీచంద్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు, ఎన్​ఎస్​యూఐ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details