తెలంగాణ

telangana

By

Published : Jun 30, 2022, 9:27 AM IST

ETV Bharat / state

'ఆ విద్యార్థికి వచ్చింది సున్నా కాదు.. ఒక్క మార్కు'

Inter Board: మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన హరికిరణ్‌ అనే విద్యార్థికి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సంస్కృతంలో సున్నా మార్కులు వచ్చినట్లు మెమోలో చూపింది. దీనిపై స్పందించిన ఇంటర్‌బోర్డు ఆ విద్యార్థి జవాబు పత్రాన్ని బుధవారం సబ్జెక్టు నిపుణుడితో పునఃపరిశీలన చేయించగా ఆ విద్యార్థికి సున్నా కాదు.. ఒక మార్కు వచ్చిందని ఇంటర్‌బోర్డు తెలిపింది

ఇంటర్‌బోర్డు
ఇంటర్‌బోర్డు

Inter Board: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సంస్కృతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన హరికిరణ్‌ అనే విద్యార్థికి సున్నా మార్కులు వచ్చినట్లు మెమోలో చూపిన ఇంటర్‌బోర్డు.. ఆ విద్యార్థికి ఒక మార్కు వచ్చిందని బుధవారం తెలిపింది.

ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో తప్పులు దొర్లాయంటూ మళ్లీ మళ్లీ అదే తప్పు.. ఇంటర్ బోర్డు తీరు మారదాశీర్షికన ఈటీవీ భారత్​లో బుధవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఇంటర్‌బోర్డు ఆ విద్యార్థి జవాబు పత్రాన్ని బుధవారం సబ్జెక్టు నిపుణుడితో పునఃపరిశీలన చేయించింది. అంతకు ముందు ఎగ్జామినర్‌ ఆ విద్యార్థి జవాబు పత్రానికి సున్నా వేశారని, తాజా ఎగ్జామినర్‌ మాత్రం ఒక మార్కు ఇచ్చారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details